మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని తెలుగులో పవన్కల్యాణ్ కథానాయకుడిగా పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రానా కీలక పాత్రధారి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పదవీవిరమణ చేసిన ఆర్మీ ఆఫీసర్, ఓ పోలీస్ అధికారి నడుమ అనుకోకుండా చోటుచేసుకున్న సంఘర్షణ వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందన్నదే చిత్ర కథాంశం. కొవిడ్ సెకండ్వేవ్ ప్రభావంతో తెలుగు రీమేక్ చిత్రీకరణ వాయిదా పడింది. ఈ నెల 11 నుంచి చిత్రీకరణను పునఃప్రారంభించబోతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్కు సంబంధించిన అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘పరశురామ కృష్ణమూర్తి’ అనే టైటిల్ను ఖరారు చేసే యోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు. ఈ సినిమాలో నిత్యామీనన్, ఐశ్వర్యరాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాల్ని అందిస్తున్నారు.