నాలుగేండ్ల విరామం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తెరపైకి వస్తుండటంతో ఆయన కొత్త సినిమా ‘పఠాన్’పై బాగా క్రేజ్ పెరుగుతున్నది. ఈ నెల 25న విడుదలవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి. బుకింగ్స్ ప్రారంభమైన 36 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయినట్లు తెలుస్తున్నది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో గూఢచారి పాత్రలో షారుఖ్ కనిపించబోతున్నారు. ఆయన సహచర స్పై క్యారెక్టర్లో దీపికా పడుకోన్ నాయికగా నటించింది. జాన్ అబ్రహాం ప్రతినాయకుడి రోల్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే అనేక వివాదాలు వచ్చాయి.
ఈ కాంట్రవర్సీలను కూడా ప్రచారానికి ఉపయోగించుకుంది చిత్రబృందం. సెన్సార్ కూడా కష్టమేనన్న అభిప్రాయాల మధ్య షారుఖ్ సినిమా గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నది.