Pathaan Movie | కరోనా ప్రభావంతో కష్టకాలంలో పడిపోయిన అన్ని ఇండస్ట్రీలు కుదురుకున్నాయి. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ తప్ప. గత రెండేళ్లుగా సరైన హిట్టు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ తేలిపోయింది. మధ్యలో ‘భూల్ భూలయా-2’, ‘దృష్యం-3’ వంటి సినిమాలు బాలీవుడ్కు నేనున్నా అంటూ పలకరించినా.. ఎక్కడో సౌత్ సినిమాల డామినేషన్ కనిపించింది. సౌత్ సినిమాల కలెక్షన్లు ముందు అవి నథింగ్లా అనిపించాయి. పైగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో బైకాట్ అంశం ఎక్కువైపోయింది. దాంతో సినిమాలు రిలీజ్ చేయాలంటేనే దర్శక, నిర్మాతల్లో ఎక్కడ లేని గుబులు. ఈ క్రమంలో అన్ని వివాదాలను ఎదుర్కొంటూ పఠాన్ జనవరి 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
రిలీజ్ ముందు నుంచి ఈ సినిమాపై ఎక్కడ లేని బజ్ ఏర్పడింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. తొలిరోజే అనుకుంటే వరుసగా ఆరు రోజులు వంద కోట్ల గ్రాస్కు దిగకుండా కలెక్షన్లు రాబడుతూ బాలీవుడ్ బాక్సాఫీస్కు ఊపిరిపోసింది. షారుఖ్ఖాన్ యాక్షన్, దీపికా అందాలు, జాన్ అబ్రహం విలనిజం ప్రేక్షకులను థియేటర్లకు రిపీటెడ్గా వచ్చేలా చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సరికొత్త రికార్డు నెలకొల్పింది. బుధవారం కలెక్షన్లతో ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ ఫీట్ అందుకున్న తొలి బాలీవుడ్ మూవీగా హిందీ బెల్ట్పై సరికొత్త రికార్డు నెలకొల్పింది. మిక్స్డ్ టాక్తో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించందంటే షారుఖ్ క్రేజ్ ఏంటో తెలుస్తుంది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. షారుఖ్కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. జాన్ అబ్రహం కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించాడు. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 950 కోట్లకు పైగా గ్రాస్ను కలెక్ట్ చేసింది. ఇదే జోరు కొనసాగితే పఠాన్ మూవీ ఫుల్ రన్లో రూ.1000 కోట్లు మార్క్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. అయితే శుక్రవారం ఈ సినిమాకు పోటీగా షెహజాదా రిలీజ్ కానుంది. కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అలవైకుంఠపురం సినిమాకు రీమేక్గా తెరకెక్కింది.
ఈ సినిమాపై చెప్పుకోదగ్గ అంచనాల్లేనప్పటికీ నెలరోజులు బాలీవుడ్లో మరో సినిమా రాలేదు. దాంతో ప్రేక్షకులు కొత్త సినిమాను కోరుకుంటున్నారు. షెహజాదాకు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా పఠాన్ వెయ్యి కోట్లకు ఎదురీగాల్సి వస్తుంది. కాగా ఇక్కడే పఠాన్ మైండ్ గేమ్ ఆడింది. శుక్రవారం ఒక్కరోజు మల్టీప్లెక్స్లలో ఈ సినిమాను రూ.110కే సినిమా చూసే వెసలుబాటు కల్పించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలంటే ఇదొక్కటే దారి.