Pathaan Controversy | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీని వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ పాట విడుదలైనప్పటి నుంచి వివాదం మొదలైంది. ఈ పాటలో దీపికా పదుకొణె వేసుకున్న దుస్తులు, పాటను చిత్రీకరించిన విధానం అసభ్యకరంగా ఉందంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఇప్పటికే ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని ఆందోళనకు సైతం దిగారు. తాజాగా షారుక్ను సజీవ దహనం చేస్తానంటూ ఓ సాధువు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తపస్వీ ఛావ్నీ మహంత్ పరమహంస ఆచార్య.. ‘పఠాన్’ చిత్రంపై మండిపడ్డారు. ‘బేషరమ్ రంగ్’ పాటలో కాషాయ దుస్తుల్ని అవమానించారన్నారు. ‘మన సనాతన ధర్మానికి చెందిన వారు దీనిపై నిరంతరం నిరసనలు తెలుపుతున్నారు. ఈరోజు షారుక్ ఖాన్ పోస్టర్ను తగలబెట్టా. నేను జిహాదీ షారుక్ ఖాన్ను కలిసినట్లయితే.. అతనిని సజీవ దహనం చేస్తాను. పఠాన్ చిత్రాన్ని బహిష్కరించాలని ప్రజలను కోరుతున్నా. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే వాటిని తగలబెడతాను’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించాడు. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.