Parineeti Chopra | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధాతో ఆమె వివాహం గత నెలలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అంగరంగవైభవంగా జరిగింది. దీంతో సినిమాల కన్నా.. ఇతర విషయాలతోనే సోషల్ మీడియాలో సెన్సేషన్గా ఆమె మారింది. అయితే తాజాగా తన పేరిట ఉన్న ఫ్యాన్ క్లబ్స్, ఫ్యాన్ పేజీల తీరుపై పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఆగ్రహం వ్యక్తం చేసింది.
”కొన్ని ఫ్యాన్ పేజీలు నా పేరును ఉపయోగించి తమ అభిమాన నటీనటులకు అనుకూలంగా పోస్టులు వేయడం చూస్తున్నాను. అవి నా దృష్టికి వచ్చాయి. అయితే ఆ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. ఏ ఒక్కరినీ ప్రశంసించడానికి లేదా అభినందించడానికి నేను ఎలాంటి ఇంటర్వ్యూలూ ఇవ్వలేదు. ఇలాంటివి మళ్లీ రిపీటైతే.. రిపోర్ట్ చేస్తా. మీరు ఏదైనా పోస్టు చేసే ముందు గూగుల్ చెయ్యండి. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు అంటూ ఇన్స్టా వేదికగా పరిణీతి రాసుకోచ్చింది.