యోగేశ్వర్, అతిథి జంటగా రూపొందుతున్న చిత్రం ‘పరారి’. సాయి శివాజీ దర్శకుడు. జీవీవీ గిరి నిర్మాత. ఈ నెల 30న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఇదొక వైవిధ్యభరితమైన ప్రేమకథా చిత్రం. అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారికి కావాల్సిన అంశాలున్నాయి.
మహిత్ నారాయణ్ అందించిన సంగీతం చిత్రానికి ప్లస్ అవుతుంది. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.