యోగేశ్వర్, అతిథి జంటగా నటిస్తున్న చిత్రం ‘పరారి’. సాయిశివాజీ దర్శకుడు. జీవీవీ గిరి నిర్మించారు. ఈ నెల 30న విడుదలకానుంది. గురువారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. సీనియర్ నటుడు సుమన్ థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి మహిత్ అద్భుతమైన సంగీతాన్నందించాడు. వినూత్న కథతో వినోద ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. హీరోగా తనకిది తొలి చిత్రమని, వైవిధ్యమైన కథలో నటించడం ఆనందంగా ఉందని యోగేశ్వర్ తెలిపారు. ఆద్యంతం వినోదప్రధానంగా ఈ చిత్రం మెప్పిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, షాయాజీషిండే తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.