సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘పరమ్ సుందరి’ ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఈ సినిమా తాలూకు పాటలు, ప్రచార చిత్రాలు భారీ హైప్ను క్రియేట్ చేశాయి. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మంగళవారం థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఢిల్లీ అబ్బాయి పరమ్, కేరళ అమ్మాయి సుందరి మధ్య ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్ ఆద్యంతం వినోదప్రధానంగా ఆకట్టుకుంది.
కేరళ తాలూకు విజువల్స్ కట్టిపడేశాయి. భిన్న సాంస్కృతిక నేపథ్యం కలిగిన ఓ జంట ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపమిదని చిత్ర దర్శకుడు తుషార్ జలోటా తెలిపారు. ఈ సినిమా వ్యక్తిగతంగా కూడా బాగా కనెక్ట్ అయిందని, తాను పోషించిన సుందరి పాత్ర తన దక్షిణాది మూలాలు, ఘనమైన వారసత్వాన్ని గుర్తుచేసేలా ఉంటుందని జాన్వీకపూర్ తెలిపింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.