Pankaj Udhas | చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. గజల్ దిగ్గజం, పద్మశ్రీ పంకజ్ ఉధాస్ (Pankaj Udhas) మరణించాడు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో (Prolonged Illness) బాధపడుతున్న ఉధాస్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 72 ఏళ్లు.
ఉధాస్ మరణవార్తను ఆయన కుమార్తె నయాబ్ ఇన్స్టా వేదికగా తెలియజేశారు. ‘బరువైన మృదయంతో.. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 26వ తేదీన పద్మశ్రీ పంకజ్ ఉధాస్ మరణించిన విషయం తెలియజేయడానికి చింతిస్తున్నాము’ అంటూ పోస్టు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ఉధాస్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.
Also Read..
Drug Racket | అంతర్జాతీయ డ్రగ్స్ దందా.. నిర్మాతను పార్టీ నుంచి తొలగించిన డీఎంకే