రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ గురించి కొత్త విషయాన్ని వెల్లడించారు దర్శకుడు శంకర్. చిత్రీకరణ తుది అంకంలో ఉన్న ఈ సినిమాక్లైమాక్స్ను తాజాగా పూర్తి చేశామని, ఈ పతాక సన్నివేశాలు అదిరిపోతాయని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, ఇక తన తదుపరి సినిమా ‘ఇండియన్ 2’పై దృష్టి పెట్టబోతున్నట్లు శంకర్ చెప్పారు.
సామాజిక అంశాలున్న రాజకీయ నేపథ్య చిత్రంగా ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, సునీల్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు రామ్చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు.