పాన్ ఇండియా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఈ నెల 18 నుంచి ఆరంభం కాబోతున్నది. ఇందులో దేశంలోని ఎనిమిది చలన చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ముంబయిలో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సెలబ్రిటీ లీగ్లో మొత్తం ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. రాయ్పూర్, బెంగళూరు, హైదరాబాద్, జోధ్పూర్, త్రివేండ్రం, జైపూర్ నగరాలు ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి.
రితేష్ దేశ్ముఖ్ (ముంబయి హీరోస్), ఆర్య (చెన్నై రైనోస్), అఖిల్ (తెలుగు వారియర్స్), మనోజ్ తివారి (భోజ్పురి దబాంగ్స్), కుంచాకో బోషన్ (కేరళ స్ట్రైకర్స్), జిషుసేన్ గుప్తా (బెంగాల్ టైగర్స్), సుదీప్ (కర్ణాటక బుల్డోజర్స్), సోనూసూద్ (పంజాబ్ ది షేర్)..ఆయా జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ లీగ్లో 120 మంది సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నారని, జీ టీవీ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.