టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్టు మేజర్ (Major). 26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు విడిచిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా స్పెషల్ స్క్రీనింగ్ షోతో కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు మేకర్స్. జూన్ 3న దేశవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో..పలు నగరాల్లో స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.
లేటెస్ట్గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు అడివిశేష్. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ (saimanjrekar) కీ రోల్లో నటిస్తోంది. పవన్ కల్యాణ్ కోసం మేజర్ స్పెషల్ స్క్రీనింగ్ వేస్తారా..? అని ట్విటర్లో ప్రశ్నలు, రిక్వెస్ట్లు వచ్చాయి. దీనికి అడివిశేస్ స్పందిస్తూ..పవన్ కల్యాణ్ అభిమానుల కోరిక మేరకు ఆయనకు స్పెషల్ ప్రీమియర్ పక్కా అని ట్వీట్ చేసి..వారిలో జోష్ నింపాడు.
సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా మేజర్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్. కాగా శోభితా ధూళిపాల కీ రోల్ చేస్తోంది. మరి ఆ ప్రీమియర్ ఎప్పుడుండబోతుంది. పవన్ కల్యాణ్ ఎప్పుడు టైం ఇస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
PAKKA #MajorOnJune3rd https://t.co/mDj96at2Og
— Adivi Sesh (@AdiviSesh) May 25, 2022