టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand )ప్రస్తుతం డైరెక్టర్ మారుతితో (maruthi) చేస్తున్న చిత్రం పక్కా కమర్షియల్ (Pakka commercial). గోపిచంద్ 29వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీ అప్ డేట్ను మేకర్స్ అందించారు. పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన పక్కా కమర్షియల్ మూవీని జులై 1 2022న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో రాశీ ఖన్నా ఫీ మేల్లీడ్ రోల్లో నటిస్తోంది. జిల్, ఆక్సిజన్ సినిమాల తర్వాత గోపీచంద్, రాశీ ఖన్నా కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ సినిమా ఇది.
ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా బన్నీవాసు (Bunny Vasu) నిర్మాణంలో వస్తోంది. SKN సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రతీరోజు పండగే సినిమా తర్వాత మారుతి చేస్తున్న సినిమా ఇది. కామెడీ ఎంటర్ టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సప్తగిరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Get ready for 100% Pakka Entertainment! 🤙
Macho star @YoursGopichand & @DirectorMaruthi 's #PakkaCommercial in theatres from 𝐉𝐔𝐋𝐘 𝟏𝐬𝐭, 2022.#PakkaCommercialOnJuly1st #AlluAravind @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/Rxg217DIqc
— BA Raju's Team (@baraju_SuperHit) March 30, 2022
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న రంగరంగ వైభవంగా సినిమా కూడా జులై 1నే విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. బాక్సాపీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య ఫైట్ ఎలా ఉండబోతుందో ఆసక్తికరంగా మారనుంది. సీటీమార్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం అందించకపోవడంతో ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు గోపీచంద్.