Cinema News | ఇంటి బాధ్యతల్ని మోస్తున్న అరుంధతి అనే ఓ ఇల్లాలు సత్యనారాయణవ్రతం చేసుకోవాలనుకుంటుంది. అప్పుడే అనుకోకుండా తనకు ఓ సమస్య వచ్చిపడుతుంది. ఆ సమస్యనుంచి తనతోపాటు ఇంటి పరువును ఎలా కాపాడుకుందనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. వెన్నెల కిశోర్, కమల్కామరాజు, మోనిక ప్రధానపాత్రధారులు. విక్రాంత్కుమార్ దర్శకుడు. గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మాత.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ప్రొడక్షన్ జరుపుకుంటున్నది. ఇదొక ఫ్యామిలీ థ్రిల్లర్ అని, త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమా కుటుంబసమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. పృధ్వీరాజ్, చిత్రంశ్రీను, అరియానా గ్లోరీ, సునీతా మనోహర్, టార్జాన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిచైతన్య మాటేటి, సంగీతం: సునీల్కశ్యప్.