Varun Tej | వైమానిక వీరుల పరాక్రమాలను, విధి నిర్వహణలో వారు ఎదుర్కొన్న సవాళ్లను ఆవిష్కరిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి శక్తిప్రతాప్ సింగ్ దర్శకుడు. వరుణ్తేజ్ కథానాయకుడు. మానుషి చిల్లార్ కథానాయిక. సందీప్ ముద్దా నిర్మాత. డిసెంబర్ 8న విడుదలకానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
‘భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద వైమానిక దాడుల నేపథ్యంలో యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించాం. దేశభక్తి ప్రధానంగా ఆకట్టుకుంటుంది. ‘మేజర్’ వంటి విజయం తర్వాత సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’ అని చిత్ర బృందం పేర్కొంది.