తెలుగు తెరకు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వస్తుందనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతున్నా…ఆమె ఎంట్రీ ప్రాజెక్ట్కు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య తార శ్రీదేవి కూతురు కావడమే జాన్వీని టాలీవుడ్లో చూడాలనుకునేందుకు ఓ కారణం. గతంలో రామ్చరణ్తో జాన్వీ జోడీగా నటిస్తుందనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత మహేష్బాబు సరసన నటిస్తుందని చెప్పుకున్నారు.
ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ ‘లైగర్’లోనూ జాన్వీని నాయికగా తీసుకోవాలనే చర్చలు జరిగాయి. కొరటాల, ఎన్టీఆర్ ప్రాజెక్ట్తో జాన్వీ టాలీవుడ్ అరంగేట్రం జరుగుతుందనుకున్నా, ఆ వైపు అడుగులు పడటం లేదు. ఫిల్మ్ సర్కిల్స్లో మాత్రం జాన్వీ తెలుగులో ఓ భారీ ప్రాజెక్ట్తో బ్యాంగ్ లాంటి ఎంట్రీ ఇస్తుందనే నమ్మకం పోలేదు. బాలీవుడ్లో ధడక్ చిత్రంతో నాయికగా పరిచయమైన జాన్వీ కపూర్…‘గుంజన్ సక్సేనా’, ‘రూహీ’, ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాలతో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ‘మిలీ’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ చిత్రాల్లో నటిస్తున్నది.