Telugu Youtuber Harsha Sai | తెలుగు యూట్యూబర్ హర్షసాయి కేసులో ట్విస్ట్ల మీదా ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తనను లైంగికంగా దాడి చేయడంతో పాటు మానసికంగా వేధిస్తున్నట్లు కేసు పెట్టిన యువతి తాజాగా మరో విషయంపై పోలీసులను ఆశ్రయించింది. తనపై ట్రోలింగ్ చేయిస్తున్నాడని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ట్రోలింగ్ స్క్రీన్ షాట్లను పోలీసులకు అప్పగించింది యువతి. అత్యాచార బాధితురాలైన తనపై హర్షసాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
మరోవైపు హర్షసాయి పోలీసులకు దొరకకుండా తప్పించికుని తిరుగుతున్న విషయం తెలిసిందే. అతడి గురించి చిన్న సమాచారం దొరికిన ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. తెలుగు బిగ్బాస్ ఓటీటీలో పాల్గొన్న యువతి హర్షసాయి తనపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని.. అలాగే తనను నమ్మించి రూ.2కోట్ల తీసుకొని మోసం చేసినట్లు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దాంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేశారు. అలాగే, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డబ్బుల కోసమే హర్షసాయిపై అక్రమంగా కేసు పెట్టారని అతని తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
Also Read..