Akhanda-2 | అగ్ర కథానాయకుడు బాలకృష్ణ వరుస విజయాలతో జోరుమీదున్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో తన 109వ చిత్రంలో నటిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుండగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ ఏ స్థాయిలో విజయాన్నందుకుందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద వందకోట్ల మైలురాయిని దాటిందీ చిత్రం. దీంతో సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం నవంబర్లో ‘అఖండ-2’ సెట్స్పైకి వెళ్లనుందని తెలిసింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా కీలక పాత్రలో నటించనున్నారని, పాన్ ఇండియా రిలీజ్ను దృష్టిలో పెట్టుకొని ఆయన్ని తీసుకోబోతున్నారని తెలిసింది. మొదటి భాగానికి మించిన సోషియో ఫాంటసీ, యాక్షన్, ఎమోషనల్ అంశాలతో సీక్వెల్ను తీర్చిదిద్దేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను కసరత్తులు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ సీక్వెల్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముందని సమాచారం.