శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. యువీ క్రియేషన్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు నిర్మించాయి. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘యు.ఏ’ సర్టిఫికెట్ లభించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘భిన్న మనసత్తాలు, అభిరుచులు కలిగిన ముగ్గురు మిత్రుల కథ ఇది.
వారు భైరవపురంలో అనే గ్రామంలో చేసే హంగామా ఏమిటన్నదే ఈ చిత్ర కథాంశం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. వినూత్న కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రం ైక్లెమాక్స్లో ఊహించని మలుపులుంటాయి’ అన్నారు. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే కథాంశమిదని, ఓవర్సీస్తో పాటు ఇతర ప్రాంతాల్లో 21వ తేదీన ప్రీమియర్లను ప్రదర్శిస్తున్నామని నిర్మాతలు తెలిపారు.