Akshay Kumar | తొమ్మిదేళ్ల క్రితం బాలీవుడ్లో విడుదలైన ఓ మై గాడ్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉమేష్ శుక్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో నెలకొల్పిన రికార్డుల అంతా ఇంతా కాదు. పదేళ్ల క్రితమే బాలీవుడ్లో ఈ సినిమా రెండొందల కోట్లు కొల్లగొట్టింది. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ గోపాల గోపాలగా రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఓమై గాడ్కు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఓ మై గాడ్-2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటిక రిలీజైన పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పాయి.
తాజాగా మేకర్స్ టీజర్ అప్డేట్ను ప్రకటిస్తూ ఈ సినిమాలో ప్రధాన పాత్రదారులైన అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి పోస్టర్లను రిలీజ్ చేశారు. అంతేకాకుండా త్వరలోనే టీజర్ అప్డేట్ను కూడా ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అగస్టు 11న విడుదల కాబోతున్న ఈ సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో తిరుగులేని అంచనాలున్నాయి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడుగా కనిపించనున్నాడు. తొలిపార్టుకు మించి ఈ సినిమా ఉండబోతుందని, బ్లాక్ బస్టర్ పక్కా అని ఇన్సైడ్ టాక్. వాకావ్ ఫిలింస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాలో యామి గౌతమ్ కీలక పాత్ర పోషిస్తుంది.
बस कुछ दिनों में…🙏#OMG2 in theatres on August 11.
Teaser Drops Soon. pic.twitter.com/62oLCPKkCa— Akshay Kumar (@akshaykumar) July 3, 2023
मिलते हैं सच्चाई की राह पर 🙌#OMG2 in theatres on August 11!
Teaser drops soon. pic.twitter.com/qUL7b4tNYa— Akshay Kumar (@akshaykumar) July 3, 2023