సీనియర్ నటుడు వీకే నరేష్, నటి పవిత్ర లోకేష్ పెండ్లి చేసుకోబోతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరు సన్నిహితంగా ఉంటున్నారు. త్వరలో తాము వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నాం అంటూ శనివారం సోషల్ మీడియా ద్వారా నరేష్ తమ పెండ్లి విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి ఉన్న వీడియోను షేర్ చేశారు. నరేష్కు ఇది నాలుగో వివాహం కాగా…పవిత్ర తన భర్త సుచేంద్ర ప్రసాద్కు దూరంగా ఉంటున్నది. పలు చిత్రాల్లో నరేష్, పవిత్ర కలిసి నటించారు. అప్పటినుంచే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.