వెన్నెల కిషోర్, షకలక శంకర్, నందితా శ్వేత, నవమి గాయక్లు ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. శంకర్ మార్తాండ్ దర్శకుడు. అభినిక నిర్మాత. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నుంచి ‘నువ్వు తోపు’ అనే లిరికల్ వీడియోను ఇటీవల ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విడుదల చేసింది చిత్రబృందం.
నిర్మాత మాట్లాడుతూ ‘ ఇదొక వైవిధ్యమైన హారర్ కామెడీ చిత్రం. ఇందులోని ప్రతీ పాత్ర అందరికి ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది’ అన్నారు. ఈ సమావేశంలో హీరోయిన్ నందితా శ్వేత, అనూప్ రూబెన్స్, షకలక శంకర్, దర్శకుడు శంకర్ మార్తాండ్ తదితరులు పాల్గొన్నారు.