NTR30 Movie Pooja Ceremony | నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం ‘NTR30’. ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా తారక్కు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన, కొరటాల శివ ‘NTR30’కు దర్శకత్వం వహించనుడటంతో ప్రేక్షకులు ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఇప్పటికే రిలీజైన డైలాగ్ టీజర్ సినిమాపై ఎక్కడలేని బజ్ తెచ్చిపెట్టింది. ఇక ఇటీవలే రిలీజైన జాన్వీ ఫస్ట్లుక్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా ముహూర్తపు కార్యక్రమాలు మార్చి 18న గ్రాండ్గా జరుగనున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్కు సంబంధించిన పలువురు పెద్ద పెద్ద స్టార్లు ఈ వేడుకకు రానున్నట్లు టాక్. ఇక మార్చి 30 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకల నేపథ్యంలో అమెరికాలో ఉన్నాడు. పలు హాలీవుడ్ మీడియా సంస్థలకు వరుస ఇంటర్వూలు ఇస్తూ ఆర్ఆర్ఆర్ గురించి, నాటు నాటు పాట గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.
ఇక ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ విషయానికొస్తే.. కొరటాల ఈ సినిమాను సముద్ర నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఆచార్య వంటి కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల.. ఈ సినిమాతో ఎలాగైన కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడట. ఇక ఈ సినిమాకు దేవర అనే టైటిల్ను రిజిస్టర్ చేయించునట్లు వినికిడి. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించినున్నట్లు టాక్.