NTR-TRIVIKRAM MOVIE | యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. అరవిందసమేత తర్వాత మూడేళ్ళు ట్రిపుల్ ఆర్ చిత్రానికే కేటాయించాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. రామ్చరణ్ మరో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. మూడేళ్ళ గ్యాప్ను పూర్తి చేయడానికి ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే కొరటాల శివ సినిమా పట్టాలెక్కగా..ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనాతో స్పోర్ట్స్ డ్రామా కన్ఫార్మ్ అయింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉందని నిర్మాత నాగవంశీ తెలిపాడు.
అరవింద సమేత సమయంలోనే ‘అయినను పోయిరావలె హస్తినాపురకు’ అనే పొలిటికల్ యాక్షన్ డ్రామా కథ చెప్పాడని దానికి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. తర్వాత త్రివిక్రమ్ అలవైకుంఠపురం సినిమాను చేయడం, ఎన్టీఆర్ ట్రిపుల్ఆర్ చేయడం జరిగింది. దాంతో త్రివిక్రమ్-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని అందరూ భావించారు. అయితే తాజాగా నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్ట్పై క్లారిటి ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదని..జస్ట్ పోస్ట్ పోన్ అయిందని..ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా అత్యంత భారీగా తెరకెక్కించే పనిలో ఉన్నామని తెలిపాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తానని తెలిపాడు. త్రివిక్రమ్ ఒక హీరోతో సినిమా చేస్తే మళ్లీ రెండు,మూడు సార్లు అదే హీరోతో సినిమాలు చేస్తాడు. ఈ కాంబోలో కూడా కచ్చితంగా మరో సినిమా ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.