నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద విజయం సాధించింది. కరోనా సెకండ్ వేవ్ తరువాత అఖండ తో థియేటర్లు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి.ఈ విజయంతో చిత్ర బృందం, అభిమానులు, సినీ పరిశ్రము తెగ సంతోషిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు చిత్రం పై తమ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్లో స్పందిస్తూ.. అఖండ సినిమా చూడటం పూర్తయిందని, మరో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు బాలా బాబాయికి మరియు మొత్తం చిత్ర యూనిట్కి అభినందనలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు. ఇలాంటి సక్సెస్ అభిమానులకు అనందించే క్షణాలని అన్నారు.ఇదిలా ఉంటే మహేష్ బాబు కూడా అఖండ టీంకు తన శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే.
అఖండ భారీ ప్రారంభాన్ని పొందిందని వినడానికి చాలా సంతోషంగా ఉంది. నందమూరి బాలకృష్ణ గారికి బోయపాటి శ్రీను గారు మరియు టీమ్ మొత్తానికి అభినందనలు” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించగా, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.