ఈ కాలం నాటి స్టార్ హీరోల మధ్య ఎంత స్నేహ బంధం నెలకొని ఉందో మనం చూస్తూనే ఉన్నాం. పలు సందర్భాలలో వీరు కలుస్తూ అభిమానులని తెగ సంతోషింపజేస్తుంటారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో వేదికగా ముగ్గురు హీరోలు బుల్లితెర ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారట. ఎన్టీఆర్ షోకి మహేష్ గెస్ట్గా రాబోతున్నట్టు ఇటీవల అఫీషియల్ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సూపర్ ఎపిసోడ్ లో ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు సూపర్ స్టార్స్ కన్పించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ అడిగిన ఏదో ప్రశ్నకు మహేశ్ ఫోన్ ఎ ఫ్రెండ్గా పవన్ కళ్యాణ్కు కాల్ చేయగా ఆయన సపోర్ట్ చేశారనేది విషయం. ఈ సమయంలో ఎన్టీఆర్.. పవన్తో మాట్లాడుతూ.. మీరు నటించిన తొలి ప్రేమ సినిమా నాకు చాలా ఇష్టం అని చెప్పారని, ఆ తర్వాత ఇద్దరు హీరోల మధ్య ఆసక్తికర చర్చలు జరిగాయని వినికిడి. ఇందులో నిజం ఎంత ఉందనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ డిసెంబర్ 2వ తేదీన ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్నీ త్వరలోనే ప్రకటించనున్నారు.
ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఎన్టీఆర్ ఉంటేనే.. అదోక మ్యాజిక్. ఇక ఆయన ముందు సూపర్ స్టార్ మహేష్బాబు ఉంటే మరింత మ్యాజిక్ చేకూరనుంది. ఈ ఇద్దరు కలిసి బుల్లితెర మీద గేమ్ ఆడితో ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అయితే ఈ షోలో మహేష్ బాబు తన స్నేహితుడు పవన్ కల్యాణ్ను భాగం చేయడంతో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రత్యేక ఆకర్షణగా మారనుందని చెప్పవచ్చు.