ఎన్టీఆర్ 30వ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నది దివంగత అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్. దక్షిణాదిలో తెలుగు సినీరంగం అంటే ప్రత్యేకమైన అభిమానాన్ని కనబరుస్తుందీ అమ్మడు. తెలుగునాట దివంగత నటి శ్రీదేవికి విశేషమైన అభిమానగణం ఉంది. దాంతో తన అమ్మ మాదిరిగానే తాను కూడా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందాలని కోరుకుంటున్నది జాన్వీకపూర్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నది. అయితే ఈ సినిమా కోసం జాన్వీకపూర్ అందుకుంటున్న పారితోషికం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఈ చిత్రానికి జాన్వీకపూర్ ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనుందని, దక్షిణాదిలో అరంగేట్ర చిత్రం ద్వారా అత్యధిక పారితోషికం అందుకుంటున్న తార ఆమెనని అంటున్నారు. బాలీవుడ్ చిత్రాలకు జాన్వీకపూర్ తీసుకునే పారితోషికంతో పోల్చితే ఇది చాలా ఎక్కువని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఎన్టీఆర్ 30 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.