ఎన్టీఆర్ 30వ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ వె లువడింది. సోమవా రం నుంచి హైదరాబాద్లో కీలకమైన రెండో షెడ్యూల్ను మొదలుపెట్టారు. ఇందులో కథానాయిక జాన్వీకపూర్ కూడా పాల్గొంటున్నట్లు తెలిసింది. ప్రధాన తా రాగణంపై ముఖ్య ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. విస్మరణ కు గురైన ఓ సుదూర తీరప్రాంతం నేపథ్య క థతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ భారీ కసరత్తులు చేస్తున్నారు. పోరాట ఘట్టాలు, సెట్స్ను హాలీవుడ్ స్థాయిలో డిజైన్ చేయడానికి అక్కడి నిపుణుల్ని రప్పించారు. పతాకస్థాయి భావోద్వేగాలు, రొమాంచితమైన పోరాట ఘట్టాలతో ఎన్టీఆర్ అభిమానులకు ఓ పండగలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. అనిరుధ్ సంగీతాన్నందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.