కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారడం వేదాతం రాఘవయ్య నుంచి మొదలైంది. ఆ తర్వాత ప్రభుదేవ, లారెన్స్, అమ్మ రాజశేఖర్, విజయ్బిన్నీ, గణేశ్ మాస్టార్.. వీరంతా మెగా ఫోన్ పట్టినవారే. వీరిలో ప్రభుదేవ, లారెన్స్ బ్లాక్బాస్టర్స్ తీశారు. ఈ వరుసలోనే మరో కొరియోగ్రాఫర్ మెగా ఫోన్ పట్టనున్నారు. ఈ సినిమాకు నిర్మాత కూడా తనే కావడం విశేషం. ఆయనే సతీశ్రాజ్. ‘ఎస్.ఆర్. మూవీ జంక్షన్’ పేరిట నిర్మాణ సంస్థని స్థాపించారాయన.
ప్రముఖ నిర్మాత, నటుడు మురళీమోహన్ గురువారం బేనర్ లోగోను ఆవిష్కరించి, సతీశ్రాజ్కు శుభాశీస్సులు అందించారు. ఈ సందర్భంలోనే ‘శ్రద్ధ సబూరి’ పేరుతో సతీశ్రాజ్ రూపొందించిన సాయిబాబా భక్తిగీతాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, విజయ్ బిన్నీ, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ కలిసి ఆవిష్కరించి సతీశ్రాజ్ను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, దర్శకుడు చంద్రమహేశ్, నటులు కాదంబరి కిరణ్, వినోద్బాల, హీరోయిన్ శిరీష తదితరులు పాల్గొన్నారు.