Rajinikanth | ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో తనకు ఎదురైన అనుభవాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇటీవల ఆశ్రమంకి సంబంధించిన 45వ వార్షికోత్సవం మరియు శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తలైవర్, ఆధ్యాత్మికత ముందు తన స్టార్డమ్ చాలా చిన్నదని పేర్కొన్నారు. గతంలో కేవలం రెండు రోజులు గడపడానికి ఆశ్రమానికి వచ్చిన తాను, అక్కడి ప్రకృతి ఒడిలో ప్రశాంతతను పొంది ఏకంగా 15 రోజుల పాటు ఉండిపోయానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒకరోజు గురుదేవ్ సూచన మేరకు ఆశ్రమంలో కలియతిరుగుతున్నప్పుడు వందలాది మంది ఉన్నప్పటికీ తనను కనీసం ఒక్కరు కూడా గుర్తుపట్టకపోవడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని రజనీకాంత్ వివరించారు.
సాధారణంగా తాను ఎక్కడికి వెళ్లినా ఫోటోలు, ఆటోగ్రాఫ్ల కోసం అభిమానులు ఎగబడతారని, కానీ ఆశ్రమంలోని వారు కనీసం తనవైపు చూడలేదని ఆయన నవ్వుతూ చెప్పారు. అక్కడ తమిళనాడుకు చెందిన వారు చాలామంది ఉన్నప్పటికీ ఎవరూ తనను పట్టించుకోలేదని, తాను అభివాదం చేస్తున్నా కనీసం స్పందించలేదని తెలిపారు. ఈ ఘటన తనలోని అహాన్ని ఒక్కసారిగా అణచివేసిందని, స్టార్డమ్ అనేది తాత్కాలికమని, ఆధ్యాత్మికత ద్వారా వచ్చే శాంతి మాత్రమే శాశ్వతమని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. సినిమాల్లో గుర్తింపు మనిషితో పాటే అంతమైపోతుందని, కానీ ఆధ్యాత్మిక ప్రయాణం మరణానంతరం కూడా కొనసాగుతూనే ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
VIDEO | Recalling his earlier visit to the Art of Living, actor Rajinikanth (@rajinikanth) brought the house down with his humorous take, said, ‘nobody even looked at me’.#Rajinikanth pic.twitter.com/JPZGgxtLMv
— Press Trust of India (@PTI_News) May 12, 2026