Aadavallu meeku johaarlu movie postponed | శర్వానంద్ తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా వస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్తో శర్వానంద్ పోటీ పడతాడా? సైడ్ అవుతాడా అన్న టాపిక్ టాలీవుడ్లో ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో శర్వానంద్ వెనక్కి తగ్గాడు. ఆయన నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను మార్చి 4న వాయిదా చేస్తున్నట్లు ఆ చిత్ర బృందం ప్రకటించింది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. రష్మిక మంధన కథానాయిక. సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయాలని ముందు నుంచి అనుకున్నారు. అనుకున్న టైమ్కి భీమ్లా నాయక్ సినిమా వస్తుందో రాదో అన్న అనుమానం ఉండటంతో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల కోసం అన్ని సన్నాహాలు చేశారు. ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. శర్వానంద్ సహా చిత్ర బృందం మొత్తం ఇందులో పాల్గొన్నారు. కానీ చెప్పిన టైమ్కే ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉంటుందా? లేదా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వాయిదా పడుతుందా? అనే అంశం ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ క్రమంలో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మార్చి 4వ తేదీకి షిఫ్ట్ అయ్యింది. దీంతో ఆ వారం శర్వానంద్ సినిమాకే ఎక్కువ థియేటర్లు దక్కే అవకాశం ఉంది.