SSMB29 | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు (Maheshbabu) అభిమానులకు ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29 ) ఫీవర్ అందుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28గా తెరకెక్కిన గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్బాబు ఫోకస్ అంతా ఇకపై ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29పైనే పడ్డది. జక్కన్న, మహేశ్బాబు మిక్స్డ్ స్టిల్తో.. క్యాప్షన్ లేదు.. ఫొటో చాలా మాట్లాడుతుంది.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతోంది.. అంటూ తాజా అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్గా రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 29 స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశానని ఇప్పటికే రైటర్ విజయేంద్రప్రసాద్ చెప్పారని తెలిసిందే. అంతేకాదు ఈ మూవీలో పాపులర్ హాలీవుడ్ యాక్టర్ కూడా నటించే అవకాశాలున్నాయని కూడా వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2026 ఉగాది కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్టున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. ఎంఎం కీరవాణి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ చేశాడట. అంతేకాదు అమృతం ఫేం ఎస్ఎస్ కంచి ఈ చిత్రానికి వన్ ఆఫ్ ది స్టోరీ రైటర్గా వ్యవహరించనున్నాడట.
అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో పాపులర్ హిందీ యాక్టర్లతోపాటు వరల్డ్వైడ్గా ఉన్న స్టార్ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. జక్కన్న కాంపౌండ్ నుంచి వస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్లో షూటింగ్కు ప్లాన్ చేస్తున్నారట.
సినిమాలో ఎక్కువభాగం ఈ సెట్లోనే షూటింగ్ జరుగనుండగా.. మిగిలిన భాగాన్ని ఆఫ్రికా, యూరప్లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎస్ఎస్ఎంబీ 29కు సంబంధించిన రానున్న రోజుల్లో ఇక బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అభిమానులను ఫుల్ ఖుషీ చేయబోతున్నట్టు తాజా వార్తలతో అర్థమవుతోంది.
ఎస్ఎస్ఎంబీ 29 నయా అప్డేట్..
No Caption… Picture speaks a lot !!
ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.#SSMB29 🔥 pic.twitter.com/3BEV10srNS
— Rajesh Manne (@rajeshmanne1) January 23, 2024