ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది. కరోనా పాజిటివ్ వస్తే తప్పకుండా పద్నాలుగు రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందే. కాని వకీల్ సాబ్ హీరోయిన్ నివేదా థామస్ కరోనాతోనే థియేటర్కు వెళ్లి సినిమా చూసిందని ఆమెపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఒక సెలబ్రిటీ అయి ఉండి ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటావా అంటూ నివేదాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నివేదా థామస్ పూర్తి క్లారిటీ ఇచ్చింది.
ఏప్రిల్ మొదటి వారంలో నివేదా థామస్కు కరోనా సోకడంతో ఆమె క్వారంటైన్లో ఉంది. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు కూడా ఈ కారణంతోనే హాజరు కాలేకపోయింది. అయితే ఏప్రిల్ 10న తాను థియేటర్లో వకీల్ సాబ్ సినిమా చూస్తున్న పిక్స్ షేర్ చేసింది. దీంతో షాక్ అయిన ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో బదులిచ్చిన నివేదా థామస్.. తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని, అందుకే థియేటర్లో సినిమా చూసానని పేర్కొంది. ప్రమోషన్ టైంలో కరోనా రావడం బాధ అనిపించింది. రైట్ టైమ్కు నెగెటివ్ వచ్చింది. మునుపటిలా ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లోనే ఉండి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోమన్నారు వైద్యులు. అయితే ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో చూసేందుకు తాను థియేటర్కు వెళ్లానంటుంది నివేదా. కోవిడ్ వలన ప్రేక్షకులని నేరుగా కలవలేకపోయిన వారు పెడుతున్న పోస్ట్లన్నింటిని చదువుతున్నానని స్పష్టం చేసింది. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ సినిమా రీమేక్ లో నటిస్తోంది.