ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో మళయాళ సూపర్ హిట్ అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలు పోషించారు. కరోనా వలన ఆగిన ఈ చిత్ర షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. పవన్ త్వరలోనే షూటింగ్కి హాజరు కానున్నాడు.
గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా కనిపించేది ఎవరు అనే ఆతృత అందరిలో ఉంది. తాజాగా పవన్ సరసన నిత్యా మీనన్ కన్ఫార్మ్ అయినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో నిజమెంత ఉందనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా థమన్ సంగీతం ఇస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.