వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఆయన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు శరవవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను సాగర్ చంద్ర తెలుగులో రీమేక్ చేస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది
పవన్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్ర షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తైనట్టు తెలుస్తుంది. ఇందులో పవన్ సరసన టాలెంటెడ్ నటి నిత్యామీనన్ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. కరోనా ఉదృతి తగ్గాక ఆ అమ్మడు షూటింగ్లో పాల్గొననుందని సమాచారం. ఇక రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేశ్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే . ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్ర్కీన్-ప్లే అందిస్తున్నారు.