Sai Pallavi | భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్కు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. నితేష్ తివారి దర్శకత్వం వహిస్తారు. ఇందులో రాముడి పాత్రలో రణ్బీర్కపూర్, సీతగా సాయిపల్లవి నటించనుంది. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం శ్రీరామ నవమి రోజున ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. భారీ సాంకేతిక హంగులతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబోతున్న ఈ చిత్రంలో వివిధ భాషల అగ్ర నటులు భాగమవుతున్నారు. రావణుడిగా కన్నడ అగ్ర హీరో యష్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ప్రీత్సింగ్ నటించనున్నారని వార్తలొస్తున్నాయి. ఏప్రిల్ మాసంలో శ్రీరామ నవమి రోజున అధికారికంగా ప్రాజెక్ట్ను ప్రకటించడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ను కూడా మొదలుపెడతారని బాలీవుడ్లో వార్తలొస్తున్నాయి.