యంగ్ హీరో నిఖిల్ తన పని తాను చేసుకుంటూనే మరోవైపు ప్రజల సమస్యలపై కూడా స్పందిస్తుంటాడు. కరోనా సమయంలోతన సొంత ఖర్చులతో చాలా మందికి సాయం అందించాడు. అయితే కొద్ది రోజులుగా ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు చూసి చలించిపోయిన నిఖిల్ తన ఆక్రోశాన్ని కంట్రోల్ చేసుకోలేక సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడిని తిట్టి పడేశాడు.
ఇన్నేళ్లు ఆఫ్ఘానిస్తాన్లో తన సైన్యాన్ని ఉంచిన అమెరికా ఇప్పుడు మాత్రం వెనక్కి తీసుకుంటోంది. ఆగస్ట్ 31 వరకు మిగిలిన సైనికులందరినీ సైతం తీసుకొచ్చేలా ప్రణాళికలు వేస్తోంది. అమెరికా సైన్యం వెనక్కి వెళుతుండడంతో అక్కడ తాలిబన్ల అరాచకం మొదలైంది.మహిళలు, చిన్నారులు, అమాయకులు పడుతున్న బాధలను చూసి ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు.కొన్ని సన్నివేశాలను చూస్తుంటే చాలా బాధేస్తుంది.
ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీద నిఖిల్ నిప్పులు చెరిగారు. స్వేచ్చాప్రపంచం అనే దానికి అమెరికా ఉదాహరణగా ఉండేది.. కానీ అది ఇప్పుడు పోయింది.. 21 ఏళ్లుగా ఎన్నో కష్టాలు పెట్టారు.. ఇప్పుడు ఇలా పారిపోయారు. నువ్ ఇంకెప్పుడైనా ఫ్రీడం గురించి మాట్లాడితే.. జో బైడెన్ చెప్పు తెగుద్ది.. ఎదవ అని సిద్దార్థ్ ఫైర్ అయ్యారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి.