Jubilee Hills Venkateswara Swamy Temple | ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి తర్వాత మొదటిసారిగా హైదరాబాద్లో దర్శనమిచ్చారు. ఆదివారం ఉదయం ఈ కొత్త జంట జూబ్లీహిల్స్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి (టీటీడీ) ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ నూతన జీవితం సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటూ స్వామివారిని దర్శించుకున్న ఈ వేడుకలో విజయ్ దేవరకొండ సంప్రదాయబద్ధమైన కుర్తాలో కనిపించగా, రష్మిక పట్టుచీరలో మెరిసిపోయారు. వీరితో పాటు విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఈ జంటకు వేదాశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. తమ వివాహ సందర్భాన్ని పురస్కరించుకుని అభిమానులకు మిఠాయిలు పంచుతామని గతంలోనే ప్రకటించిన ఈ జంట, దర్శనం ముగిసిన తర్వాత ఆలయ ప్రాంగణంలోని భక్తులకు, అభిమానులకు స్వయంగా మిఠాయిలు పంపిణీ చేశారు. విజయ్-రష్మికలు ఆలయానికి వస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకోగా, “విరోష్” జంట చిరునవ్వుతో అందరికీ అభివాదం చేస్తూ సందడి చేశారు. కాగా, మార్చి 4న హైదరాబాద్లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ జంట గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
#virosh distribute sweets ❤️#VijayDeverakonda #RashmikaMandanna pic.twitter.com/XxLZXWjpAp
— Thedeverakonda (@VijayDe78593148) March 1, 2026