బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 95వ ఎపిసోడ్కి చేరుకుంది. ఎపిసోడ్ మొదట్లో కాజల్- మానస్లు కాసుపు ముచ్చటించుకున్నారు. షణ్ముఖ్.. సిరిని ప్రతి ఒక్క విషయంలో కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని మానస్ కాజల్తో చెప్పగా.. అవును ఖచ్చితంగా కంట్రోల్ చేస్తున్నాడు అని కాజల్ అంటుంది. ఇలా అయితే సిరి ఇండివిడ్యువాలిటీ పోతుందని మానస్ చెబుతాడు.
ఇక బయట మానస్- కాజల్ డిస్కషన్ జరుగుతుండగా, లోపల సిరి-షణ్ముఖ్ పక్క పక్క బెడ్స్పై పడుకుని చీకట్లో ఏవో సైగలు చేసుకుంటూ కనిపించారు. ఆ ఉదయాన్ని అందరూ ‘నీ కన్ను నీలి సముద్రం’ పాటకు డాన్స్ వేస్తూ కనిపిస్తే.. షణ్ముఖ్-సిరిలు హగ్ చేసుకుంటూ కనిపించారు. అనంతరం బిగ్ బాస్ .. హౌస్లో జరిగిన సంఘటనల్ని ఒక్కొక్కటిగా రీ క్రియేట్ చేస్తున్నారు. మూడో సంఘటనలో భాగంగా.. జెస్సీ-శ్రీరామ్ల మధ్య జరిగిన గొడవని రీక్రియేట్ చేయాలని చెప్పారు.
సిరి, షణ్ముఖ్, జెస్సీ వంట చేస్తున్న సమయంలో శ్రీరామ్ తో పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగిన సంగతి తెలిసిందే.దీనిని రీ క్రియేట్ చేయాలని ఆదేశించారు బిగ్ బాస్. అయితే ముందు ఎపిసోడ్లో షణ్ముఖ్ని సన్నీ ఇమిటేట్ చేయడంతో అదే ఫైర్లో ఉన్నాడు షణ్న. తాజాగా జెస్సీ విషయంలో సిరి-షణ్ముఖ్ ఎలా ప్రవర్తించారో చేసి చూపిస్తూ వీళ్లిద్దరూ యూటర్న్ తీసుకుని వెళ్లిపోయారని వాళ్లని ఇమిటేట్ చేస్తాడు.. దీంతో షన్నూ సీరియస్ అయ్యాడు. ఇలాంటివి చేయొద్దని నిన్ననే చెప్పాను. జరగలేనిది చేస్తే నాకు నచ్చదు అని అంటాడు షన్నూ.