నెరు
డిస్నీ+హాట్స్టార్: జనవరి 23
నటీనటులు: మోహన్లాల్, అనశ్వర రాజన్, సిద్దిఖ్, శంకర్ చందుచూడన్, ప్రియమణి తదితరులు
దర్శకత్వం: జీతూ జోసెఫ్
Neru | మాలీవుడ్లో సూపర్హిట్ సాధించిన సినిమాలెన్నో ఓటీటీలో బంపర్ స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నాయి. అలా అలరిస్తున్న చిత్రమే ‘నెరు’. సీరియస్ పాయింట్కు కోర్డు డ్రామా జతకలిపి ఆద్యంతం ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ సక్సెస్ సాధించాడు. దృశ్యం, దృశ్యం-2 సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్న జీతూ ‘నెరు’లో ఏం చూపించాడు? సారా మహ్మద్ (అనశ్వర రాజన్) అంధురాలు. గుర్తుతెలియని వ్యక్తి ఆsమెపై అత్యాచారం చేస్తాడు. మట్టితో శిల్పాలు చేయడంలో సిద్ధహస్తురాలైన సారా.. తనపై అత్యాచారం చేసిన వ్యక్తి శిల్పాన్ని చేస్తుంది. దాని ఆధారంగా పోలీసులు మైఖేల్ జోసెఫ్ (శంకర్)ను అరెస్టు చేస్తారు. మైఖేల్ సంపన్నుల బిడ్డ.
అతణ్ని కాపాడుకోవడానికి మైఖేల్ తండ్రి పేరుమోసిన క్రిమినల్ లాయర్ రాజశేఖర్ (సిద్దిఖ్)ను రంగంలోకి దించుతాడు. అంధురాలు తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని ఎలా శిల్పంగా చేస్తుందని వాదించి, నిందితుడికి బెయిల్ వచ్చేలా చేస్తాడు రాజశేఖర్. మరోవైపు సారా తరఫున కోర్టులో వాదించడానికి ఏ లాయరూ ముందుకురాడు. పోలీసుల సూచన మేరకు సారా కేసు తీసుకోవాల్సిందిగా ఆమె తండ్రి… లాయర్ విజయ్ మోహన్ (మోహన్లాల్)ను ఆశ్రయిస్తాడు. చాలా రోజులుగా ప్రాక్టీస్కు దూరంగా ఉన్న విజయ్ సారా కథ విన్నాక ఆమె తరఫున వాదించడానికి ఒప్పుకొంటాడు. ఇంతకీ సారాపై అత్యాచారం చేసింది ఎవరు? విజయ్ మోహన్ కేసు ఒప్పుకొన్న తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? విజయ్కి, రాజశేఖర్ కూతురు పూర్ణిమ (ప్రియమణి)కి ఉన్న సంబంధం ఏంటి? ఇదంతా మిగిలిన కథ.