బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. నిన్నే ఇష్టపడ్డాను,విలన్, పరమవీర చక్ర వంటి చిత్రాలతో అలరించిన నేహా ధూపియా 2003లో “మిస్ ఇండియా:ది మిస్టరీ” అనే హిందీ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. తరువాత ఈమె “క్యా కూల్ హై హమ్”, “షూట్ అవుట్ లోఖండ్వాలా” వంటి విజయవంతమైన చిత్రాలలో ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా “చుప్చుప్కే”, “సింగ్ ఈజ్ కింగ్” వంటి సినిమాలలో సహాయపాత్రలను పోషించింది.
నేహా ధూపియా.. అండగ్ బేడి అనే వ్యక్తిని 2018 మేలో పెళ్లి చేసుకోగా అదే సంవత్సరం నవంబర్లో మెర్ అనే బేబికి జన్మనిచ్చారు. ఇటీవల బేబి బర్త్డే వేడుక ఘనంగా జరిపించగా, వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. తాజాగా నేహా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా త్వరలో రెండో బేబికి జన్మనివ్వబోతున్నట్టు పేర్కొంది. ఇందులో నేహా, ఆమె భర్త బ్లాక్ డ్రెస్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం నెహాకు నెటిజన్స్, సెలబ్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.