బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ (Aryan Khan) ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న ముంబై తీరంలో క్రూయిజ్ షిష్లో ఆర్యన్ఖాన్ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు (Narcotics Control Bureau) అదుపులోకి తీసుకున్నారు. సుమారు 25 రోజులపాటు జైలులో ఉన్న ఆర్యన్ఖాన్తోపాటు మరో ఇద్దరు నిందితులకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా..జైలు నుంచి విడుదలయ్యారు. ఆర్యన్ ఖాన్ జైలులో ఉన్నపుడు ఈ కేసు దర్యాప్తు చేసింది సిట్ బృందం.
షిప్ లో దాడులు నిర్వహించిన సమయంలో ఎన్సీబీ అధికారులు..ఆ దృశ్యాలను రికార్డు చేయలేదట. విషయమేంటంటే ఎన్సీబీ మాన్యువల్ ప్రకారం దాడులు నిర్వహించిన దృశ్యాలను కెమెరాలో రికార్డు చేయాల్సి ఉంటుంది. కానీ ఎన్సీబీ మాత్రం ఆ దాడులను రికార్డు చేయక తప్పు చేసింది. ఎన్సీబీ చేసిన ఈ చిన్న తప్పుతో ఆర్యన్ఖాన్కు ఈ కేసు నుంచి పెద్ద ఉపశమనం లభించనుందట.
మొత్తానికి ఎన్సీబీ చేసిన తప్పిదం ఈ స్టార్ కిడ్ కు గొప్ప ఊరట కలిగించబోతుందన్న వార్త షారుక్ఖాన్కు అతని అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొడుకు కేసుతో తీవ్ర మనోవేదనకు గురైన షారుక్ఖాన్ కుటుంబానికి ఇది సంతోషకరమైన సమయం.