Nayanthara | అగ్ర కథానాయిక నయనతార కెరీర్పరంగా మంచి విజయాలతో దూసుకుపోతున్నది. ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసి మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇటీవల 39వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న ఈ భామ భర్త విఘ్నేష్ శివన్ నుంచి నాలుగుకోట్ల విలువైన మెర్సిడీస్ మేబాక్ కారును బహుమతిగా అందుకుంది. ఈ సందర్భంగా కారుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది.
‘నా పుట్టినరోజున అందుకున్న అత్యంత విలువైన బహుమానం ఇది. డియరెస్ట్ హస్బెండ్ విఘ్నేష్కు ప్రేమతో కృతజ్ఞతలు’ అని పేర్కొంది. మెర్సిడీస్కు చెందిన ఈ కారు కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలకు మాత్రమే ఉందని, దక్షిణాదిన ఈ కారును కొనుగోలు చేసిన తొలి సినిమా తార నయనతారేనని చెబుతున్నారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ను నయనతార గత ఏడాది వివాహమాడింది. వీరిద్దరు సరోగసీ ద్వారా ఉయిర్, ఉలగ్ అనే కవల పిల్లలను కన్నారు. ప్రస్తుతం నయనతార తమిళంలో అన్నపూర్ణ్నే, టెస్ట్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.