సూరత్: బంగారు ఆభరణాలతో పాటు ఇతర బంగారు వస్తువులపై కచ్చితంగా హాల్మార్క్ ఉండాలన్న నిబంధన దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సూరత్లో సూరత్లో ఉన్న జ్వలరీ షాపు ఓనర్లు, కస్టమర్లు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించారు. బంగారు ఆభరణాలపై హాల్మార్క్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందని ఓ కస్టమర్ తెలిపారు. హాల్మార్క్ ఉన్న బంగారం కొంటే.. మనల్ని ఎవరూ మోసం చేయలేరన్న నమ్మకం పెరిగిందన్నారు. హాల్మార్క్ బంగారం వంద శాతం శుద్ధీకరించి ఉంటుందని ఓ కస్టమర్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ నిర్ణయం సంతోషకరంగా ఉందని, అమ్మకందారుడు, కొనుగోలుదారుడి మధ్య నమ్మకం పెరుగుతుందని, దేశమంతా కస్టమర్కు హాల్మార్క్ బంగారమే లభిస్తుందని, వాళ్లు నూటికి నూరు శాతం ప్యూర్ గోల్డ్ దొరుకుతుందని కుశాల్భాయ్ జ్వలర్స్ షాపు ఓనర్ తెలిపారు. బంగారు ఆభరణాలు, ఇతర ఆర్ట్ వస్తువులపై హాల్మార్క్ తప్పనిసరిగా ఉండాలని 2019 నవంబర్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే 2021, జనవరి 15వ తేదీ నుంచి హాల్మార్క్ కచ్చితంగా ఉండాలని సూచించింది. కానీ పాత స్టాక్కు హాల్మార్కింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆ గడువును జూన్కు పెంచారు. నేటి నుంచి ఆ నియమం అమలులోకి వచ్చేసింది.