Nayanthara | కమల్హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) చిత్రం ఓ క్లాసిక్గా నిలిచిపోయింది. దాదాపు 36 ఏళ్ల విరామం తర్వాత కమల్హాసన్-మణిరత్నం కలయికలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘కమల్హాసన్ 234’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్ర నిర్మాణంలో కమల్హాసన్, మణిరత్నం సైతం భాగస్వాములవుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది.
కథానుగుణంగా ఈ చిత్రంలో ఇద్దరు నాయికలకు చోటుందని తెలిసింది. అందులో ఓ హీరోయిన్గా త్రిష పేరును ఖరారు చేశారు. గతంలో కమల్హాసన్, త్రిష కలిసి రెండు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నయనతారను మరో నాయికగా ఎంపిక చేశారని తెలిసింది. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్-2’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది.