లేడీ సూపర్ స్టార్ నయనతార గేర్ మార్చింది. హీరోయిన్గానే కాకుండా మహిళా ప్రధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ఈ అమ్మడు కొన్నాళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్తో పీకల్లోతు ప్రేమలో ఉండగా, త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. `అయితే ఈ రోజు ఉదయం నయన్- విఘ్నేష్లు విఐపి దర్శనంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నయనతార విఘ్నేష్ శివన్ల నిశ్చితార్ధం ఇప్పటికే పూర్తి కాగా, అతి త్వరలోనే నయన్, విగ్నేష్ ల పెళ్లి జరగబోతోందని అంటున్నారు. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే..వివాహం తర్వాత నయన్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివాహం తర్వాత నటన మానేసి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది