లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు దాటినా ఇప్పటికీ అదే స్టార్ డం ఎంజాయ్ చేస్తుంది నయనతార. చేతిలో ఎప్పుడు కనీసం మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా మరో చాలెంజింగ్ రోల్ చేయడానికి సిద్ధమైపోయింది ఈ భామ. కెరీర్లో తొలిసారి అంధురాలుగా నటిస్తుంది. ఇదివరకే నేను రౌడీనే సినిమాలో చెవిటి అమ్మాయిగా నటించి అవార్డులు సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తోంది నయనతార. నెట్రికన్ సినిమాలో బ్లైండ్ పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ మధ్య మన హీరో హీరోయిన్లు ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు నయనతార కూడా రాజా ది గ్రేట్ లో రవితేజ మాదిరి బ్లైండ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. లాక్ డౌన్ గాని లేకపోయి ఉంటే గత ఏడాది నవంబర్లో అనే సినిమా విడుదల అయి ఉండేది. కానీ మధ్యలో కరోనా వైరస్ వచ్చి అన్ని ప్లాన్స్ పాడు చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా కచ్చితంగా చాలా బాగుంటుంది అని బలంగా నమ్ముతోంది నయనతార. ఈ సినిమాను మిలింద్ రావు తెరకెక్కిస్తున్నాడు. గతంలో సిద్ధార్థ్ హీరోగా గృహం సినిమాను తెరకెక్కించాడు. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన గృహం సంచలన విజయం సాధించింది.
ఇప్పుడు నయనతార నేట్రికన్ సినిమాతో ఖచ్చితంగా మరో విజయం అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాను నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే సినిమా విడుదల తేదీపై పూర్తి క్లారిటీ రానుంది. ఓటిటీలో విడుదల చేయాలని కూడా ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. గతంలో నయనతార నటించిన అమ్మోరు తల్లి సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా విషయంలో కూడా ఇదే చేయాలని చూస్తున్నారు.