ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. జాతిరత్నాలు సినిమాతో మనోడి క్రేజ్ భీబత్సంగా పెరిగింది. దీంతో ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి.ఇప్పటికే అనుష్కతో కలిసి నవీన్ ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తుండగా, మరికొన్ని ప్రాజెక్ట్లు ఆయన ఖాతాలో వచ్చి చేరాయి.
ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఓ సినిమా చేయడానికి నవీన్ పోలిశెట్టి ఒప్పందం కుదుర్చుకొని పారితోషికం రూ.4 కోట్లు తీసుకున్నాడట. రంగ్ దే
కో డైరెక్టర్ తో నవీన్ కి కథ చెప్పించారు. కథలో నవీన్ కొన్ని మార్పులు చేర్పులూ చెప్పాడు. అది చేసినా.. కథ ఓ దారికి రాలేదని సమాచారం. దాంతో.. ఈ కథని నవీన్ పూర్తిగా పక్కన పెట్టేశాడని సమాచారం.
కథ తనకు నచ్చకపోవడంతో నవీన్ పోలిశెట్టి సితార ఎంటర్టైన్మెంట్స్ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ని తిరిగి ఇచ్చేశాడట. ఇక యూవీ సంస్థ నుండి నవీన్ అడ్వాన్స్ తీసుకున్నాడు. యూవీలో సినిమా ఈపాటికే ప్రారంభం కావల్సివుంది. కానీ… ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు. రానున్న రోజులలో కుర్ర హీరో వైవిధ్యమైన సినిమాలతో అలరించనున్నట్టు తెలుస్తుంది.