నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేష్బాబు.పి దర్శకుడు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘ఈ చిత్రంలో అన్విత రవళి పాత్రలో అనుష్క, స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్ పొలిశెట్టి జంట చక్కటి వినోదాన్ని పండిస్తుంది.
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సరొకొత్త ప్రేమకథతో ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నీరవ్షా, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, నిర్మాతలు: వంశీ-ప్రమోద్, రచన-దర్శకత్వం: మహేష్బాబు.పి.