Anushka | నవీన్ పొలిశెట్టి, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేష్బాబు దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకురావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని, త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.
రిలీజ్ వాయిదా వేసినందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతున్నామని నిర్మాతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘నిశ్శబ్దం’ (2020) తర్వాత అనుష్క తెరపై కనిపించలేదు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత రాబోతున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం వాయిదా పడటంతో అనుష్క అభిమానులు నిరాశ చెందారు. ఆద్యంతం హాస్య ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.